Friday, March 19, 2010

ఆయకట్టు కనికట్టే ...


సీఎం చెప్పింది 19.26 లక్షల ఎకరాలు
వాస్తవిక పెరుగుదల 8.08 లక్షల ఎకరాలు
గణంక శాఖ నివేదికలో వెల్లడి



జలయజ్ఞం ఆయకటు్ట గురించి ప్రభుత్వం ఇన్నాళు్ల చెప్పింది కటు్టకథేనని తేలిపోయింది. కొత్తగా సాగులోకి తెచ్చినటు్ల ప్రభుత్వం చెప్పిన ఆయకటు్టలో సగం కూడా రాలేదని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక, గణంకాల శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2009 వరకు రాషాభివృద్ధికి చెందిన గణంకాల వివరాల నివేదికను 2010 మార్చి 18న అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు అందేశారు. 2004-05లో కాలువల కింద 13,45,979 హెక్టార్ల ఆయకటు్ట సాగైతే, 2008-09లో 16,69,447 హెక్టార్లు సాగైంది. అంటే పెరుగుదల 3,23,468 హెక్టార్లు (8,08,670 ఎకరాలు) మాత్రమే. ఇన్నాళు్ల ప్రభుత్వం చెప్ఫిన దానికి, దీనికి పొంతనేలేదు. ముఖ్యమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో జలయజ్ఞం ద్వారా 2004-05 నుంచి 2008-09 వరకు 19.26 లక్షల ఎకరాల కొత్త ఆయకటు్టను సాగులోకి తెచ్చామని, 3.09 లక్షల ఎకరాల ఆయకటు్టను స్థిరీకరించామని చెప్పారు. ఇందులో చిన్న నీటివనరుల కింద సాగులోకి వచ్చిన 5.09 లక్షల ఎకరాలు కూడా ఉన్నటు్ల నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా అటు అసెంబ్లీలోనూ, బయటా కొత్త ఆయకటు్ట వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం కొత్త ఆయకటు్ట 14.56 లక్షల ఎకరాలు కాగా, స్థిరీకరించిన ఆయకటు్ట 3.08 లక్షల ఎకరాలు. అంటే మొత్తం సాగులోకి వచ్చిన ఆయకటు్ట 17.64 లక్షల ఎకరాలు. 2009-10లో భారీ ప్రాక్టుల కింద 44,256 ఎకరాలు, మధ్యతరహా ప్రాక్టుల కింద నాలుగువేల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించినటు్ల బడ్జెట్‌ ఫలితాలు పేరుతో అసెంబ్లీకి అందేసిన నివేదికలో మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఇలా ప్రభుత్వం నుంచి ఎవరు చెప్పినా జలయజ్ఞం కింద సాగులోకి వచ్చిన ఆయకటు్టలో పెద్ద తేడా లేదు. కానీ వాస్తవంగా సాగైన ఆయకటు్ట వివరాలతో గణంకాల శాఖ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే మాత్రం జలయజ్ఞం ఆయకటు్ట విషయంలో ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో సగం ఆయకటు్టకు కూడా నీరందలేదు. చెరువుల కింద దేళ్లలో 1,70,704 హెక్టార్ల (4,26,760 ఎకరాలు) ఆయకటు్ట పెరిగింది. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చిన్న నీటి వనరుల కింద పెరిగిన ఆయకటు్ట 5.09 లక్షల ఎకరాలు. ఇది కూడా వాస్తవం కాదన్న విషయం గణంక శాఖ నివేదిక వెల్లడిస్తోంది. బావులు, బోర్ల కింద మాత్రం సాగైన ఆయకటు్ట గణనీయంగా పెరిగింది. గత ఐదేళ్లలో 4,19,532 హెక్టార్లు(10,48,830 ఎకరాలు) పెరిగింది. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన జలయజ్ఞం కింద ఇప్పటివరకు రూ.1.80లక్షల కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. పెరిగిన వ్యయం, అదనపు పనులతో కలిపి రెండు లక్షల కోట్ల రూపాయలు దాటింది. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.50,050 కోటు్ల వ్యయం చేసింది. ఇంత భారీ మొత్తం వ్యయం చేసిన తర్వాత కూడా సాగులోకి వచ్చిన ఆయకటు్ట మాత్రం నామమాత్రమే కావడం గమనార్హం.



No comments:

Post a Comment