Saturday, February 13, 2010

దేశమంతా శివనామస్మరణ


దేశ వ్యాప్తంగా శుక్రవారం శివనామ స్మరణ మారుమోగింది. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో మహా శివరాత్రి పర్వదినాన్ని జరుపుకున్నారు. దేశంలోని అన్ని శివాలయాలు.. పుష్ప, విద్యుద్దీపాలంకరణలతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు హరిద్వార్‌లోని కుంభ్ వద్ద గంగా నదిలో పవిత్ర స్నానాలాచరించారు.వేలాది మంది నాగసాధువుల భం భం భోలే అంటూ మంత్రోచ్ఛారణలతో.. మంగళవాయిద్యాలతో శివున్ని స్తుతించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 300 ప్రత్యేక స్నానఘట్టాలలో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో మహా శివరాత్రి పండుగ సందర్భంగా దేవాలయాల్లోని శివలింగాలను పాలు, గంగా జలంతో అభిషేకించారు. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయానికి భక్తులు పోటెత్ారు. కుంభమేళాలో శివరాత్రి స్నానాలు పోటెత్తిన భక్తులు హరిద్వార్: ఓ వైపు కుంభమేళా జరుగుతుండడం.... అందులోనూ మహాశివరాత్రి పర్వదినం కావడంతో శుక్రవారం హరిద్వార్ వద్ద గంగా నదిలో వేలాది సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. కుంభమేళా జరుగుతుండగా శివరాత్రి రావడం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్ర సందర్భం కావడంతో గురువారం అర్ధరాత్రి నుంచే నదీ తీరం భక్తులతో పోటెత్తింది. భం భం భోలే నినాదాలతో హోరెత్తింది. కుంభమేళాలో భాగంగా సాధువులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తొలి రాజ స్నానం( షాహీ స్నాన్) ఆచరించారు

No comments:

Post a Comment