Saturday, February 13, 2010

రైతు సంతోషమే... దేశానికి హితం

నీటి పారుదల శాఖ బిజినెస్ స్కూల్ విద్యార్థుల సూచన.
సాగర్ ఆధునీకరణ పనులపై సామాజిక అధ్యయనం
(హైదరాబాద్) రైతులు ఎల్లవేళలా సంతోషంగా ఉంటేనే దేశానికి ఎంతో మంచిదని ఇండియన్ బిజినెస్ స్కూలు విద్యార్థులు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖాధికారులకు సూచించారు. ఆయకట్టు పరివాహక ప్రాంతంలో స్థానిక వాగులు, వంకలను అభివృద్ధిపరచాలని సూచించారు. దేశంలో మొదటిసారిగా.. రాష్ట్ర నీటి పారుదల శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని ఇండియన్ బిజినెస్ స్కూల్‌కు చెందిన విద్యార్థులతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనుల వల్ల కలిగే సామాజిక, ఆర్ధిక ఫలితాలపై అధ్యయనం జరిపించింది. 'సాగర్ కాల్వల కింద చివరి ఆయకట్టుదారులకు నీటిని ఇవ్వాలంటే.. ఏథెన్స్ ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న్టుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని సూచించారు. ఆధునీకరణ పనుల వల్ల ప్రయోజనాలే అధికంగా ఉంటాయి' అని అ«ధ్యయనం చేసిన ఐఎస్‌బీ విద్యార్థులు సింధు సుబ్రహ్మణియన్, సాయిసృజన్ పొండలూర్, పృథ్వీ రాజారాం, అర్జున్ గుహ సూచించారు.

No comments:

Post a Comment